తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అన్ని కోట్ల లాభాలను అందుకున్న 'విక్రమ్' మూవీ..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ 2018 లో విడుదల అయిన విశ్వరూపం 2 సినిమా తర్వాత చాలా సంవత్సరాల పాటు వెండి తెర ద్వారా ప్రేక్షకులను అలరించలేకపోయడు. ఇలా చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కమల్ హసన్ తాజాగా విక్రమ్ సినిమాతో వెండి తెర ద్వారా ప్రేక్షకులను పలకరించాడు .

విక్రమ్ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. ఫహాద్ ఫాజిల్ ఒక కీలక పాత్రలో నటించగా, సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. మంచి అంచనాలతో జూన్ 3 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన విక్రమ్ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.  ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సూపర్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన విక్రమ్ సినిమా అతి తక్కువ రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.50 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు 17 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.47 కోట్ల షేర్ , 27.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 17 రోజులకు గాను విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.97 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: