ఎన్టీఆర్, చరణ్ లతో 'కాఫీ విత్ కరణ్'..?

Anilkumar
బాలీవుడ్లో అత్యంత పాపులారిటీ షో గా పేరుపొందిన 'కాఫీ విత్ కరణ్'టాక్ షో ఏడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ని తాజాగా ప్రకటించారు ప్రముఖ నిర్మాత, వ్యాఖ్యాత కరణ్ జోహార్. ఇక ఈ ఏడో సీజన్లో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ సమంత అలాగే అగ్రహీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్,రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొంటారని సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. అందుకు సంబంధించిన వివరాలను కరణ్ జోహార్ ఆదివారం వెల్లడించారు. జూలై 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుందంటూ ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడో సీజన్ తో ఈ షోలో కి ఆరంగేట్రం చేయబోతోంది. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. సమంత ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలోని బ్యాగ్రౌండ్ కరణ్జోహార్ ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలను బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండటంతో సమంత కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొనబోతుందని అందరికీ స్పష్టమైపోయింది. మరోవైపు పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ టాక్ షోలో పాల్గొనపోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక పుష్ప లో హీరోయిన్గా నటించిన రష్మిక తో కలిసి బన్నీ కాఫీ విత్ కరణ్ షో కి వస్తారని తెలుస్తోంది.

 అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సైతం ఈ షో లో కనువిందు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే రెండు సార్లు కాఫీ విత్ కరణ్ షో కి వెళ్లారు. ఇక ఈ టాక్ షో మొట్టమొదటిసారి 2004లో స్టార్ వరల్డ్ టీవీ ఛానల్ లో ప్రసారమైనది. అప్పటినుంచి ప్రేక్షకులను అలరిస్తూ ఏకంగా ఆరు నెలల పాటు సాగింది. ఇక ఇప్పుడు ఏడో సీజన్లో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.దీంతో టాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఈ టాక్ షో పై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్రవరి 10, 2023న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: