ఓరి నాయనో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అది మళ్లీ మొదలెట్టారుగా?

praveen
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు ఎంతలా ప్రేక్షకులను అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా కార్యక్రమాల్లో కనిపించే కొన్ని విషయాలు మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు విరక్తి తెప్పిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలలో కొంతమంది మధ్య లవ్ ట్రాక్ ఉంది అంటూ ప్రేక్షకులను నమ్మించడానికి నిర్వాహకులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జబర్దస్త్ ప్రారంభంలో రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మించి షో రేటింగ్ అమాంతం పెంచుకున్నారు.

 ఇప్పటికీ ఈ జంట కి బుల్లి తెర పై ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత కాలంలో బుల్లితెరపై బ్లాక్ అండ్ వైట్ జోడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు వర్ష, ఇమ్మానియేల్ జోడి. ఇక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. అనే విధంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో చూపించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇక వీరిద్దరి లవ్ ట్రాక్ పైన అదే షోలో ఉన్న కమీడియన్స్  కామెడీ చేయడంతో ఆ కొన్నాళ్లపాటు వీరిద్దరి లవ్ ట్రాక్ ఎక్కడ తెరమీద కనిపించలేదు.

 కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ నిర్వాహకులు మరోసారి ఇలాంటి లవ్ ట్రాక్ మొదలెట్టేశారు అని అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమో మొత్తం ఎప్పటిలాగానే సందడి సందడిగా మారింది. అయితే ప్రోమో చివరిలో వర్ష నిన్ను ఇమ్మానియేల్ ఎప్పుడైనా అనుమానించాడా అంటూ అడుగుతుంది జడ్జి ఇంద్రజ. అయితే ఇమాన్యుల్ ఎప్పుడు నన్ను అనుమానించ లేదని ఇక ఎవరేమనుకున్నా తాను ఇమ్మానియేల్ నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అని వర్ష చెబుతుంది. అలాగే మీ అమ్మకు చెప్పు కోడలు రాబోతుంది అంటూ డైలాగ్ చెప్పి సిగ్గుపడుతూ స్టేజీ దిగి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత వామ్మో వీళ్ళు మళ్ళీ మొదలెట్టేశారు గా అటు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: