స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని!

Purushottham Vinay
ఇక మన తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్క్రిప్ట్ రైటర్ గా ఇంకా అలాగే నటుడిగా పలు సినిమాలలో నటించి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి నటుడిగా పేరు పొందాడు పోసాని కృష్ణ మురళి.ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మాటలతో మరింత పాపులారిటీ గా పేరు సంపాదించారు. టాలీవుడ్ టాప్ హీరోలతో ఆయన చాలా సినిమాలలో నటించారు.ఇక గాయం సినిమాతో మొదటి సారి సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చివరిగా సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాలో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని ఆయన నటించిన హీరోస్ తో అనుభవాన్ని పంచుకున్నారు వాటి గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.నటసింహం బాలకృష్ణ తో చాలా సినిమాల్లో నటించానని పోసాని తెలిపారు. ఆయనకి కోపం అనేది ఎక్కువగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు కానీ ఆయన చాలా సరదాగా కలిసి పోతాయని నిజాయితీ గల మనిషి అని పోసాని తెలియజేశారు. తన తండ్రి రామారావు గారు సీఎం అయినా కూడా అక్రమంగా ఏమి సంపాదించలేదు.కేవలం నిజాయితీగా కష్టపడి పైకి వచ్చిన సంపాదించారని తెలిపారు.మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ -150 సినిమాలో నటించిన ఆయన.. చిరంజీవి సెట్లో చాలా బాగా ఉంటారని తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ తో నటించడం పట్ల కూడా ఆయన స్పందించడం జరిగింది .


పవన్ కళ్యాణ్ తో సినిమా వరకు మాత్రమే ఉంటానని అతనితో మాట్లాడే పరిస్థితి అంతా కూడా కేవలం సినిమాల గురించి ఉంటుందని తెలియజేశారు పోసాని.ఇక టాప్ హీరోల్లో టాప్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించేటప్పుడు చాలా సరదాగా ఉంటుందని ప్రతి ఒక్కరు తో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారని పోసాని తెలిపారు. సెట్లో ఆయనతో చాలా ఫన్నీగా ఉంటుందని తెలిపారు పోసాని.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ని చూస్తూ ఉన్నానని అందువల్ల సన్నిహిత్యం కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు.తారక్ ని ఎక్కువగా బాబు అని పిలుస్తూ ఉంటానని తెలిపారు పోసాని.ఇంకా అక్కినేని నాగ చైతన్య తో తనకు ఉన్న అనుబంధం చాలా బాగుంటుంది అని చెప్పారు. చైతూ ఒక గౌతమ్ బుద్ధుడు లాంటి వారని ఇంకా నాగచైతన్య ఇన్నోసెంట్ అబ్బాయి అని తెలిపారు పోసని. అందుచేత అతను నాకు బాగా నచ్చుతాడని తెలియజేశారు పోసాని. పోసాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: