జబర్దస్త్ : పతనం.. దారుణంగా పడిపోయిన TRP రేటింగ్స్!

Purushottham Vinay
ఇక ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి వారం గురువారం ఇంకా శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపొయ్యి మరీ ఈ షో చూస్తారు..ఈ కామెడీ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ వచ్చి మంచి డిమాండ్ ఉన్న నటులుగా ఇప్పుడు కొనసాగుతున్నారు..అంతమందికి మంచి జీవితం ని అందించిన ఈ షో ఇప్పుడు తీవ్రమైన కష్టాల్లో పడినట్టు అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి..ఈటీవీ కి ఇప్పటికి కూడా మంచి TRP రేటింగ్స్ తో టాప్ చానెల్స్ తో పోటీపడడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఖచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పాలి..ఇక అలాంటి షోకి ఇప్పుడు పాపులారిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది..మొదట్లో ఈ షో కి 6 కి తక్కువ కాకుండా TRP రేటింగ్స్ అనేవి వచ్చేవి. ఇక గడిచిన పదేళ్లలో ఈ షో ఇదే స్థాయి TRP రేటింగ్స్ ని బాగా దక్కించుకుంటూ వచ్చింది..కానీ ఈ ఏడాది ఈ షో TRP రేటింగ్స్ అయితే అతి దారుణంగా పడిపొయ్యాయట..ప్రస్తుతం అయితే గత కొద్ది వారాల నుండి కనీసం 2 TRP రేటింగ్స్ కూడా ఈ షో అసలు దక్కించుకోలేకపోతుందట..ఈ షో కి ప్రస్తుతం ఆయువుపట్టు లాగా ఉంటూ వస్తున్న సుడిగాలి సుధీర్ ఇంకా అలాగే హైపర్ ఆది వంటి వారు మానేయడం వల్లే TRP రేటింగ్స్ ఈ స్థాయిలో డౌన్ అయ్యాయి అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం.


మొదట ఈ షో లో మొదటి నుండి జడ్జి గా ఉంటూ వస్తున్న నాగబాబు మానేయడం దగ్గర నుండి పతనం ప్రారంభం అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న గుసగుసలు..మల్లెమల ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో ఏర్పడిన కొన్ని విభేదాల కారంగానే ఆయన ఈ జబర్దస్త్ షో నుండి తప్పుకున్నారు..కానీ సుడిగాలి సుధీర్ ఇంకా అలాగే హైపర్ ఆది వంటి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్స్ ఈ షో లో కొనసాగుతూ ఉండడం వల్ల TRP రేటింగ్స్ మాత్రం అయితే అసలు అంత దారుణంగా అయితే అప్పట్లో పడిపోలేదు..కానీ ఇటీవల ఈ ఇద్దరు కూడా ఈ షో మానేశారు..వీళ్ళు డిమాండ్ చేసినంత పారితోషికం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఇవ్వకపోవడం వల్లే వీళ్ళు ఈ షో ని విడిచినట్టు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తున్న గాసిప్ ..అలాగే మరోపక్క జడ్జి రోజా కూడా తనకి మంత్రి పదవి రావడం తో ఇక ఈ షో నుండి తప్పుకున్నారు..ఇప్పుడు ఉన్న కమెడియన్స్ చేస్తున్న స్కిట్స్ ఏ మాత్రం అసలు జనాలను ఆకట్టుకోలేకపోవడం వల్లే ఈ స్థాయిలో TRP రేటింగ్స్ పడిపోయాయి అని సమాచారం తెలుస్తుంది..ఇక పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు వారాలు కొనసాగితే ఈ షో ఆగిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న సమాచారం. ఇక మరి ఈ షో అధినేత ఒక్క మెట్టు దిగి హైపర్ ఆది ఇంకా అలాగే సుడిగాలి సుధీర్ ని మళ్ళీ షో లోకి తీసుకొస్తారా..లేదా ఇలాగే కొనసాగుతారా అనేది ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: