నడి రోడ్డు పై రేష్మీ డ్యాన్స్.. వైరల్..

Satvika
బుల్లితెరపై యాంకర్ రష్మి క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడిగా ఎంత అలరించిందో.. ఒంటరిగా సుధీర్, రష్మీలు కూడా అంతే అలరిస్తూ వస్తున్నారు... రేష్మీ బాగా ఫెమస్ అయ్యింది.అయితే ఈ అమ్మడు ఈటీవీ లో  సుధీర్ స్టార్ మా లో ఉన్నారు.అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్ల కోసం స్టార్ మాలోకి వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం రష్మీ ఈటీవీకే పరిమితమైంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవీ డ్రామా కంపెనీని కూడా నడిపిస్తోంది రష్మీ. గత వారం నుంచే రష్మీ శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వచ్చింది.


యాంకర్‌గా ఆ షోను నడిపించేందుకు ముందుకు వచ్చింది. మొత్తానికి రష్మీ మాత్రం సుధీర్ లేని లోటును తీర్చాలని చూస్తోంది. కానీ జనాలు మాత్రం సుధీర్‌నే కోరుకుంటున్నారు. అయినా కూడా సుధీర్ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక రష్మీ మాత్రం కంటిన్యూ అయ్యేట్టుంది. తాజాగా రష్మీ ఓ రీల్ వీడియో ను షేర్ చేసింది. అది కూడా నడి రోడ్డు మీద చేసేసింది. అసలే రష్మీ డ్యాన్సులు ఈ మధ్య హాట్ టాపిక్‌ గా మారుతున్నాయి. స్టేజ్ మీద రష్మీ స్టెప్పులు వేస్తే అవి ట్రెండింగ్‌ గా మారుతున్నాయి.
మరో కొత్త షో లో కూడా రేష్మీ డ్యాన్స్ ను ఇరగ దీసిందని చెప్పాలి. రష్మీ సింపుల్‌గా తన కళ్ల తోనే మాయ చేసేస్తోంది.


 చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తోంది. అసలే తనకు ఎంతో ఇష్టమైన పాట అని, ఈ మధ్య అదే మైండ్‌లో తిరుగుతోందని కూడా రష్మీ చెప్పుకొచ్చింది. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలోని మెహబూబ అనే పాట ఈ మధ్య ఎక్కువగా తిరుగుతోందని, అందుకే ఈ రీల్ వీడియో చేశాను అని రష్మీ తెలిపింది.. రేష్మీ అందాలను చూసిన  జనాలు ఫిదా అవుతున్నారు. వాటికి కామెంట్లు కూడా పెడుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: