స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోయిన యాంకర్ రష్మి.. ఫ్యాన్స్ షాక్?

praveen
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా యాంకర్ గా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. తర్వాత వెండితెరపై పలు సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలలో కూడా ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది రష్మి. తన అందం అభినయంతో ఎప్పుడు అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవల యాంకర్ రష్మి స్టేజ్ మీద మాట్లాడుతూనే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్టేజి మీద ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇది చూసిన అభిమానులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. యాంకర్ రష్మి కి ఏమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఇక ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలీ.

 అయితే సాధారణంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా సుడిగాలి సుదీర్ కనిపిస్తూ ఉంటాడు.. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో రష్మీ యాంకర్ గా రావడం గమనార్హం. దీంతో సుడిగాలి సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో మానేశాడా అని అందరూ షాక్ లో మునిగిపోయారు. ఈక్రమంలోనే ఎప్పటిలాగానే ప్రోమో సందడి సందడిగా సాగింది. ఇక చివర్లో యాంకర్ రష్మి ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ లో మునిగిపోయారు. స్టేజ్ మీదకి పరిగెత్తుకొచ్చి ఏం జరిగిందా అని గమనించారు. ఇది చూసి అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పాలీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: