ముంబై కి చెక్కేసిన సమంత.. అందుకేనా..?

Anilkumar
ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.అయితే  ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఇప్పుడు సమంతకు సంబంధించిన ఓ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కాగా ఈ బ్యూటీ అన్ అఫీషియల్ గా ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు సమాచారం. ఇకపోతే పెళ్లైనప్పటి నుంచి సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండేది.కాగా విడాకుల తరువాత చైతు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో సమంత సింగిల్ గా ఉంటుంది. 

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. అయితే ఓ హిందీ వెబ్ సిరీస్, సినిమాల్లో నటించబోతుంది. కాగా అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అంతేకాదు ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేయబోతుంది సమంత. తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తోన్న సినిమా షెడ్యూల్స్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా.. సామ్ ముంబై చెక్కేస్తోంది.ఇకపోతే అక్కడే ఉంటూ రెస్ట్ తీసుకుంటుందో. ఇక అప్పుడప్పుడు హైదరాబాద్ కి వస్తూ.. తన వ్యాపారాలు చూసుకుంటుంది. అయితే ముంబైలో కూడా బిజినెస్ చేయాలనుకుంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు త్వరలోనే అక్కడే తన బట్టల ఫ్రాంచైజీను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. 

అయితే ప్రస్తుతం సమంత 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు.కాగా  ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఇక  త్వరలోనే కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఇదిలావుండగా మరోపక్క సమంత నటించిన 'యశోద' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.అయితే  ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.యశోద టీజర్కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: