ఎన్టీఆర్, మహేష్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం  క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్  సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ  ఇద్దరు హీరోలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. తాజాగా  ఇప్పుడు మహేష్ బాబు కూడా ఓ మల్టీ స్టారర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నమహేష్ బాబు తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకోవడం జరిగింది. 

అయితే అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక ఇటీవలే ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు.ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. అంతేకాదు  రానున్న రోజులలో మహేష్ బాబు- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని, దీనికి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని ప్రస్తుతం ఇండస్ట్రీలోచర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్-చరణ్‌తో మల్టీ స్టారర్ చేయగా, మహేష్‌తో కూడా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.ఇక సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, మహేష్ బాబు మధ్య ఎంతటి సఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికే వారు కలిసి పార్టీలు చేసుకున్నారు.

కాగా ఆ సమయంలో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇకపోతే ఇప్పుడు మహేష్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఫ్యాన్స్‌కి పూనకాలే అని చెప్పాలి.ఇదిలావుండగా త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ విషయానికొస్తే… గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అయితే అతడు సినిమా అయితే ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.ఇక  ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తోందంటే చాలామంది టీవీకి అతుక్కుపోతారు.అయితే  మహేష్-త్రివిక్రమ్ మరోసారి జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: