పూజా హెగ్డే ఐటెం సాంగ్స్ లో.. ఈ కామన్ పాయింట్స్ గమనించారా?
ప్రస్తుతం హీరోయిన్ గా నటించడమే కాదు పలు సినిమాల్లో ఐటంసాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. గతంలో రంగస్థలంలో జిగేల్ రాణిగా నటించి ప్రేక్షకుల అందరిని అలరించింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్ 3 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ ఐటెం సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.
కాగా పూజా హెగ్డే నటించిన రెండు ఐటమ్స్ సాంగ్స్ లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తున్నాయ్. అదేంటంటే.. 2018లో రంగస్థలం లో ఐటెం సాంగ్ చేయగా.. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనిచేశాడు. ఇప్పుడు ఎఫ్ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేయగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ కావడం గమనార్హం. అంతేకాదు ఇక రంగస్థలంలో కొణిదల కాంపౌండ్ హీరో చరణ్ తో కలిసి స్టెప్పులు వేస్తే ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో అదే కొణిదల హీరో వరుణ్ తేజ్ తో కలిసి కాలు కడిపింది. రంగస్థలం సమ్మర్ స్పెషల్గా విడుదల అయితే ఇప్పుడు ఎఫ్ 3 కూడా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..