ఆ సినిమా షూటింగ్ కోసం మలేషియాకు బయలుదేరనున్న చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేకపోయినప్పటికీ ఒక నొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఈ  సినిమా టైటిల్ ను వాల్తేరు వీరయ్య గా కన్ఫర్మ్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా,  ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఈ మూవీ ని బాబి , మెగాస్టార్ చిరంచివి కెరియర్ లో ఊర మాస్ సినిమాలు గా  పేరు తెచ్చుకున్న గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి సినిమాల మాదిరిగా  తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా మెగాస్టార్ చిరంజీవి వీర అభిమాని అయిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు అనేక సందర్భాల్లో తెలియజేశాడు. ఇలా బాబి అనేక సందర్భాల్లో ఈ సినిమా గురించి అదిరిపోయే రేంజ్ లో చెప్పడంతో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మత్స్య కార్మికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మత్స్య కార్మికులకు నాయకుడిగా, మత్స్య కార్మికులకు ఎదురయ్యే సమస్యలను తీర్చే వ్యక్తిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర బృందం మలేషియాలో షూట్ చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దానితో వాల్తేరు వీరయ్య చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో మలేషియాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది.  అక్కడ చిత్ర బృందం సినిమా లోని కీలక సభ్యుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.  ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: