తన తండ్రి ఆరోగ్యంపై స్పందించిన శింబు...
నాన్నను పరిశీలించిన డాక్టర్లు వెంటనే స్పందించి పరీక్షలు చేయగా పొత్తి కడుపులో రక్తస్రావం జరుగుతోందని వైద్యులు తెలిపారు అని అన్నారు శింబు. కాగా మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం నాన్న ను విదేశాలకు తీసుకెళుతున్నాం, ఆయన పూర్తి స్పృహతో ఉన్నారు, మాట్లాడుతున్నారు అని మీడియాకు వివరించారు హీరో శింబు. ఇది విన్న అభిమానులకు కాస్త ఊరట లభించింది. దయచేసి ఎవరు కంగారు పడకండి మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే చికిత్స ముగించుకుని నాన్న పూర్తి ఆరోగ్యంగా తిరిగి మన ముందుకు వస్తారు.
తర్వాత మళ్లీ మిమ్మల్నందరిని కలవడానికి వస్తారని శింబు ప్రకటించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు అంతా దేవుడికి ప్రార్దనలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సైతం పరామర్శిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని హెల్త్ బాలేకపోతే చెత్త చెత్త వార్తలు అంతా ప్రచారం చేస్తున్నారు. ఏదైనా వార్తను రాసే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని రాయడం మంచిది.