గోపిచంద్, మారుతి మాస్టర్ ప్లాన్..వర్కౌట్ అవుతుందా?
డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జులై 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జీఏ2 పిక్చర్స్, మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి..గోపిచంద్ 29 వ చిత్రంగా ప్రేక్షకులను పలకరించనున్నాడు.పలుసార్లు వాయిదా పడుతూ రాగా ఫైనల్ గా ఇప్పుడు జులై 1న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఫీ మేల్లీడ్ రోల్లో నటిస్తోంది. జిల్, ఆక్సిజన్ సినిమాల తర్వాత గోపీచంద్, రాశీ ఖన్నా కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. శైలజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, మంచి రోజులు వచ్చాయి వంటి మూవీలతో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ మారుతి.. ‘పక్కా కమర్షియల్’ మూవీలో గోపిచంద్ క్యారెక్టర్ను సరికొత్తగా డిజైన్ చేశారు.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక గోపిచంద్ ఫుల్ డిస్పాయింట్లో ఉన్నాడు. ఈ సినిమాలో కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో సత్యరాజ్, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బయటకొచ్చిన టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆ అంచనాలను మారుతీ, గోపీచంద్ అందుకుంటారా ప్రేక్షకుల మనసును దాచుకుంటుందా అని జనాలు ఆలోచనలో పడ్డారు.. మారుతి సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమా కూడా భారీ హిట్ టాక్ ను అందుకుంటుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు..