టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కొన్ని రోజుల క్రితమే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అంచనాలతో విడుదలయిన గని సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. అలా గని సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన వరుణ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఎఫ్ 3 సినిమా విడుదల అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే వరుణ్ తేజ్ మరో సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ జూన్ నెల ఆఖరి నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వినూత్నమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని బాపినీడు , బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం దర్శకుడు ప్రవీణ్ సత్తార్, నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా ది ఘోస్ట్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.