తెలుగు స్టార్ హీరోయిన్ల చదువు ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న కొంతమంది ముద్దుగుమ్మలు ఉన్నత చదువులను కూడా చదివారు. అలా ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలు గురించి తెలుసుకుందాం.


సాయి పల్లవి : అద్భుతమైన డ్యాన్స్ తో , అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయి పల్లవి ఎంబిబిఎస్ ను పూర్తి చేసుకుంది.


సమంత : సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోని టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ బీ కామ్ డిగ్రీని పూర్తి చేసుకుంది.


శృతి హాసన్ : కమల్ హాసన్ కూతురు గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి,  ఆ తర్వాత తన నటనతో,  అందచందాలతో ఎంతోమంది ప్రేక్షకుల మనస్సు దోచుకున్న శృతి హాసన్ బీఎస్సీ సైకాలజీ చదివింది.


రష్మిక మందన : ఛలో  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన జర్నలిజం మరియు సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది.


పూజా హెగ్డే : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజా హెగ్డే ఎం కామ్ పూర్తి చేసింది.


నయనతార : ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార బి ఎ లిటరేచర్ చదువుకుంది.

 
కాజల్ అగర్వాల్ : చందమామ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన కాజల్ అగర్వాల్ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా ను పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: