జూనియర్ తో మళ్ళీ రాయబారాలు చేస్తున్న త్రివిక్రమ్ ?

Seetha Sailaja
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అంటూ ఆమధ్య ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపించాయి. అయితే రాజకీయాలలో సినిమా రంగంలో శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరు అన్న మాటలను మరొకసారి నిజం చేస్తూ త్రివిక్రమ్ జూనియర్ పుట్టినరోజునాడు అతడిని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

వాస్తవానికి జూనియర్ ఇప్పుడు తన విలాసవంతమైన ఇంటిలో ఉండకుండా ఐటిసి కోహినూర్ అపార్ట్ మెంట్ లో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈకారణం వల్లనే జూనియర్ తన పుట్టినరోజునాడు తనకు అభినందనలు తెలపడానికి వచ్చిన తన అభిమానులను కలవలేకపోయాడు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది కూడ జూనియర్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడో తెలియక కలవలేకపోయారు అనే టాక్ కూడ ఉంది.

అయితే త్రివిక్రమ్ మాత్రం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్న కొత్త ఫ్లాట్ లోకి వెళ్ళడమే కాకుండా అతడితో చాల ఏకాంతంగా సమావేశం అయినట్లు టాక్. ఈమధ్య ఎప్పుడులేని విధంగా ఆంజనీయ స్వామి మాల ధరించాడు. గతంలో ఎప్పుడు ఇలా తారక్ పెద్దపెద్ద పూజలు చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఇలా హఠాత్ గా జూనియర్ లో పెరిగిన ఆధ్యాత్మికత వెనుక త్రివిక్రమ్ సలహాలు ఉన్నాయా అని అనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి మధ్య పెరిగిన స్నేహం రీత్యా జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేసినా ఆశ్చర్యం లేదు అన్న అంచనాలు వస్తున్నాయి.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈసారి సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాల ఘనంగా జరగబోతున్నాయి. మే 28న నందమూరి తారకరామారావు  పుట్టినరోజునాడు జరగబోయే మహానాడు కు జూనియర్ ఎన్టీఅర్ ను కూడ ఆహ్వానించమని నందమూరి అభిమానులలో ఒక వర్గం అడుగుతోంది. అయితే ఈ ఉత్సవాల కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ జూనియర్ ను ఆహ్వానిస్తాడా లేదా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: