ప్రశాంత్ నీల్ మైండ్ లో ఇలాంటి ప్లాన్స్!!

P.Nishanth Kumar
కేజీఎఫ్ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డం దక్కించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా ను ఆయన తెరకెక్కించిన విధానం, ప్రేక్షకులు ఆదరించిన తీరు అమోఘం. ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రాణం పెట్టి చేశాడు. అందుకే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.దేశవ్యాప్తంగా ఈ సినిమా కు మంచి కలెక్షన్స్ సాధించాయి అంటే అది కేవలం ఈ సినిమా కి వచ్చిన హైప్ కారణంగానే  అని చెప్పవచ్చు. అలా ప్రశాంత్ నీల్ ఈ సినిమా విజయం సాధించి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.

ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి అందరు హీరోలు కూడా లైన్ లో ఉన్నారు. అలా ప్రభాస్ తో ఆయన సినిమా చేస్తుండగా ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్క బోతుంది. ఏదైతేనేం ప్రశాంత్ నీల్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే ఆయన కేజీఎఫ్ సినిమా కు సంబంధించి మూడో భాగాన్ని ఎప్పుడు తెరకేక్కిస్తాడా అనే వాదన ఇప్పుడు మొదలైంది. కేజీఎఫ్ రెండో భాగం సినిమాలో ఈ సినిమా యొక్క మూడో భాగం పై స్పష్టత వచ్చింది. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అనేలోపు అయన ఎన్టీఆర్ సినిమా ను మొదలుపెట్టాడు.
దాంతో ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో అని కొంతమంది కేజీఎఫ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్థాయి లో ప్రణాళికలు చేస్తున్నాడు. ఈ సినిమా ను రెండు కేజీఎఫ్ సినిమాలకు సంబంధించిన పార్ట్శ్ కంటే మించి చేయాలనీ ఆయన భావిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతుంది చూడాలి. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలు పూర్తి కావాలంటే రెండేళ్ళ సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: