బాలయ్య మళ్ళీ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా?
బాలయ్య తన నెక్స్ట్ సినిమాను చేసే అవకాశాన్ని యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కు ఇచ్చారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతకొంత కాలంగా సక్సెస్ లేక సతమతమైన బాలయ్య, అఖండ చిత్రంతో అదిరిపోయే రేంజ్లో సక్సెస్ అందుకున్నాడు.అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రంలోనూ అఖండ చిత్రానికి సంబంధించిన ఓ సెంటిమెంట్ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాడట. నిజానికి గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టులో లేని రెండు కొత్త సీన్స్ను ఇప్పుడు బాలయ్య కోసం ప్రత్యేకించి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
ఈ సీన్స్ కూడా అఖండ లాగే హిందూ ధర్మాన్ని చూపించె విధంగా కథ వుంటుందని తెలుస్తుంది.బాలయ్య సినిమాల్లో హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే సీన్స్ ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. అయితే అఖండ సినిమాలో ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే పండింది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ను ఫాలో అవ్వాలని బాలయ్య కోరాడట. దీంతో గోపీచంద్ మలినేని, అసలు కథలో లేని రెండు కొత్త సీన్స్ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథలో బాలయ్య చెలరేగిపోయి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..