వంశీ పైడిపల్లి సినిమాను మహేష్ రిజెక్ట్ చేయడం వెనుక అంత జరిగిందా ?

VAMSI
ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్య చేస్తున్న చిత్రాలన్నీ సూపర్ హిట్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఇలా వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూకుడు చూపిస్తూ సత్తా చాటుతున్నారు. “భరత్ అనే నేను” సినిమా మొదలు వరుసగా హిట్లే హిట్లు. తాజాగా “సర్కారు వారి పాట”తో మరో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే... సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. మహేష్ బాబు .. వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని దర్శకుడు వంశీ సైతం “సరిలేరు నీకెవ్వరు” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు కూడా. అయితే ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. స్టోరీ నచ్చకపోవడం తోనే మహి ఆ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
అలా వంశీ పైడపల్లి ప్రాజెక్ట్ అటకెక్కి పరుశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు మహేష్.  అయితే ప్రాజెక్ట్ మహేష్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.  అయితే ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి దళపతి హీరో విజయ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ రిజెక్ట్ చేసిన కథను హీరో విజయ్ ఒకే చేశారు అన్నది ప్రజెంట్ టాక్. ఇదిలా ఉండగా... ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు... డబుల్ రోల్ ఉన్న కారణంగానే అప్పట్లో మహేష్ ఈ స్టోరీని వద్దు అనుకున్నారని సమాచారం.
బేసిక్ గా మహేష్ కి డబుల్ రోల్ అంటే ఇష్టం ఉండదట.. అందుకే కథలో కొత్తదనం వున్న డ్యుయల్ రోల్ కావడంతో అప్పుడు మహేష్ తప్పుకున్నారు అని అంటున్నారు. కాగా గతంలో నాని సినిమాలో మహేష్ డబుల్ రోల్ చేయగా అది పెద్దగా...వర్కౌట్ అవ్వకపోడంతో అప్పటి నుండి డ్యుయల్ రోల్ చేయకూడదని అనుకున్నారట. దీనితో ఫ్యాన్స్ కూడా అందులో నుండి తప్పుకోవడమే మంచిదని మహేష్ కె సపోర్ట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: