కశ్మీరీ ఫైల్స్‌ : అక్కడ ఆకట్టుకోడంలో ఫెయిల్ అయిందిగా!

Purushottham Vinay
థియేటర్లలో బాగా దుమ్ము దులిపిన సినిమా ఓటీటీలోకి వస్తే భారీ విజయం పక్కా అని అనేసుకోవచ్చు. అలాగే కోట్ల నిమిషాల స్ట్రీమింగ్‌ లెక్కలు నమోదవుతాయని కూడా అంచనా వేసేసుకోవచ్చు.కానీ 'కశ్మీరీ ఫైల్స్‌' సినిమా విషయంలో ఈ లెక్కలన్నీ పారలేదు అని చెబుతున్నాయి ఓటీటీ వర్గాలు. మే 13 వ తేదీన ఈ సినిమా జీ5 వేదికగా వివిధ భాషల్లో విడుదలైంది. ఎక్కడ చూసినా కానీ సరైన స్పందన రావడం లేదని చెబుతున్నారు. సినిమాను చూడాలనే ఆసక్తే అసలు యూజర్లలో కనిపించడం లేదని చెబుతున్నారు.మార్చి 11 వ తేదీన చిన్న సినిమాగా విడుదలైన 'కశ్మీరీ ఫైల్స్‌'. భారీ విజయాన్ని దక్కించుకుంది. దాని వెనుక రాజకీయ ఆసక్తులు ఉండటం ఇంకా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలు ఉచిత ప్రచారాలు చేయడం అలాగే వినోద పన్ను రాయితీలు ఇవ్వడం ఇంకా రాజకీయ నాయకులు కామెంట్స్‌. ఇలా వివిధ కారణాల వల్ల ఈ సినిమా నిత్యం ప్రజల నోళ్లలో నానింది. అందుకు తగ్గట్టే సినిమాకు భారీ వసూళ్లు కూడా దక్కాయి. సుమారు రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 300 కోట్ల పైగా గ్రాస్‌ వసూలు చేసి బాలీవుడ్ పరువు నిలబెట్టింది.ఇక దీంతో ఓటీటీలో ఈ సినిమా వస్తే దుమ్ము రేగిపోతుంది.


మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఓటీటీలో సరైన స్పందనే రావడం లేదనేది తాజాగా తెలుస్తున్న విషయం. సినిమా స్ట్రీమింగ్‌ ఆన్‌ చేసి కేవలం 20 నిమిషాల్లోనే క్లోజ్‌ చేసేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా డాక్యుమెంటరీ తరహాలో ఉండటం వల్ల ఆ స్లో పేస్‌ నెరేషన్‌ నచ్చక వీక్షకులు క్లోజ్‌ చేస్తున్నారని చెబుతున్నారు.ఇక రెగ్యులర్ సినిమా తరహాలో జోష్ లేకపోవడం ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సగటు ఓటీటీ ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉంటున్నారని సమాచారం. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాపై వచ్చిన హైప్‌ వల్ల కొంతమంది అయితే బిట్స్‌ అండ్‌ పీసెస్‌గా సినిమా చూస్తున్నారట. ఒకేసారి సినిమా మొత్తం చూసేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారట. తెలుగు వెర్షన్‌ దగ్గరకు వచ్చేసరికి రీచ్ చాలా తక్కువగా ఉందని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: