మహేష్ వంశీ పైడిపల్లి సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ ఇక తాజాగా “సర్కారు వారి పాట” సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. మహేష్ బాబు మళ్ళీ తన మిత్రుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వంశీ కూడా “సరిలేరు నీకెవ్వరు” ఫ్రీ రిలీజ్ వేడుకలో కూడా తెలియజేశారు.అయితే అనుకోకుండా ఆ సినిమా క్యాన్సిల్ అవటం తెలిసిందే. స్టోరీలో మార్పులు చేర్పులు చేసిన గాని మహేష్ బాబుకి నచ్చక నో చెప్పేసి పరశురామ్ చెప్పిన “సర్కారు వారి పాట”.. సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి వంశీ పైడిపల్లి సినిమాను మహేష్ ఎందుకు క్యాన్సిల్ చేశాడు అన్నది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోవడం తెలిసిందే. ఇక ఈ తరుణంలో మహేష్ బాబు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటో ఇటీవల బయటపడింది.


ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక ఆశలు విషయంలోకి వెళితే మహేష్ నో చెప్పిన స్టోరీ తోనే వంశీ పైడిపల్లి విజయ్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.ఇక ఈ స్టోరీ డబల్ రోల్ కథ కావడంతో మహేష్ కి డ్యూయల్ రోల్ సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేకపోవడం తో వంశీ పైడిపల్లి ప్రాజెక్టుని క్యాన్సల్ చేయడం జరిగిందట. ఇక ఇదే తరుణంలో డ్యూయల్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో కూడా విజయ్ ఎదురు చూస్తూ ఉండటం తో.. ఇక వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ విన్న వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. డ్యూయల్ రోల్ కారణంగానే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తరువాత సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: