ప్రభాస్ 'స్పీరిట్' లో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందా... ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఆ తర్వాత అతి తక్కువ కాలం లోనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇలా భరత్ అనే నేను,  వినయ విధేయ రామ మూవీ లతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కీయారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా  మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.  

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పీరిట్ మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కీయారా అద్వానీ నటించబోతోంది అని కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్న ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది అని వస్తున్న వార్తలపై కియారా అద్వానీ తరఫు అధికార ప్రతినిధి స్పందించారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమా కోసం తమని ఎవరూ ఇంత వరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.  అందువలన స్పిరిట్ మూవీ లో  కియారా అద్వానీ నటిస్తుంది అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. కీయారా అద్వానీ చేసే కొత్త ప్రాజెక్ట్ ల వివరాలను అధికారికంగా తెలియజేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: