కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరైన లోకేష్ కనకరాజు గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మానగరం సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజు, కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించాడు. లోకేష్ కనకరాజు 'ఖైదీ' సినిమా తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఖైదీ సినిమా ద్వారా ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి ప్రశంసలు పొంది గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఖైదీ సినిమా కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా అటు తమిళ్, ఇటు తెలుగు లో మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ కనకరాజు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాను తెరకెక్కించాడు. జూన్ 3 వ తేదీన విక్రమ్ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటివరకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన మూడు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో విక్రమ్ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో లోకేష్ కనకరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమాల గురించి తెలియజేస్తూ... టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలియజేశాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.