కళావతి పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంచుకోవడానికి గల కారణం ఇదేనా..?

Divya
సర్కార్ వారి పాట చిత్రం ప్రాజెక్టుకు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు అందులో హీరోయిన్ ఎవరనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. అయితే అందుకోసం చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. కాని చివరికి మాత్రం కీర్తి సురేష్ ను ఫైనలైజ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంమే కాకుండా మహేష్ అభిమానులను కూడా కాస్త నిరాశకు లోనయ్యేలా చేసిందని చెప్పవచ్చు. అందుకు కారణం ఆమె నటించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడం వల్లే. ఇక ఈమె నటించిన రంగ్ దే, పెంగ్విన్, మిస్స్ ఇండియా, పెద్దన్న వంటి సినిమాలు కూడా డిజాస్టర్ ను చవిచూశాయి.
కాని సర్కారు వారి పాట సినిమాలో ఈమే హీరోయిన్ గా తీసుకునప్పట్నుంచే అభిమానులలో టెన్షన్ మొదలైంది. అయితే గత వారం విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీసు దగ్గర భారీగా కలెక్షన్లు రాబడుతోంది. కానీ ఈ చిత్రానికి ఏ మాత్రం ఫామ్ లో లేని కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని తెలియజేసింది చిత్ర బృందం. కీర్తి సురేష్ గారు మహానటి సినిమా తో ఆల్మోస్ట్ లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది అని తెలిపారు.
సినిమా కోసం ఆమె చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తుంది కళావతి పాత్ర అని అనుకున్నప్పుడు ఆ పాత్ర మహేష్ బాబు వంటి స్టార్ హీరోని మోసం చేసే విధంగా ఉంటుంది కాబట్టి కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి పాత్రలకు బాగా సరిపోతుందని అప్పుడే చిత్రబృందం అనుకున్నాడట. అందుకోసమే ఆమెను ఎంపిక చేసినట్లుగా తెలియజేశారు. ఇక అనుకున్నట్లుగానే ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బాగా చేసింది అని తెలియజేశారు. ఇక ఈమె పాత్ర జనాలకి బాగా వెళ్ళింది అంటూ తెలియజేశారు చిత్రబృందం. మరి ఈ చిత్రం మంచి కలెక్షన్లతో ప్రస్తుతం దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: