సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో సముద్ర కని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్ నటించగా, ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడం, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు, ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది.
అనేక అంచనాల నడుమ మే 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను సాధించింది. ఈ సినిమా కలెక్షన్ల పై మిక్సీడ్ టాక్ ప్రభావం ఏమాత్రం చూపించడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే... ఓవర్సీస్ లో సర్కారు వారి పాట సినిమా 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. సర్కారు వారి పాట సినిమా ఆరు రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి అయ్యేసరికి ఓవర్సీస్ లో 11.34 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేరుకొని ఓవర్సీస్ ఏరియాలో ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంది.