టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ 'మిర్చి' సినిమాతో తన కెరియర్ ను దర్శకుడిగా మొదలు పెట్టాడు. మిర్చి సినిమాతో మొదలు పెట్టుకుంటే శ్రీ మంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎదిగిన కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నడు.
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడం, మొదటిసారి చిరంజీవి, రామ్ చరణ్ ఫుల్ లెన్త్ లో ఈ సినిమాలో నటిస్తూ ఉండటం, ఒక్క అపజయం కూడా లేని కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఆచార్య సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరప రాజయాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాకుండా ఆచార్య సినిమాతో కొరటాల శివ కూడా మొట్టమొదటి పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నడు. మొట్టమొదటి పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నడు అని, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొరటాల శివ , ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమా. కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమా లో ఏ మాత్రం మెసేజ్ ఉండకుండా, పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఎంతో కొంత మెసేజ్ వుంటుంది. కాకపోతే కొరటాల శివ తన రూటు మార్చి ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం మెసేజ్ ఓరియంటెడ్ కథ కాకుండా పక్క కమర్షియల్ కథతో ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.