ఆ రెండింటిలోనూ హిట్ కొట్టేసిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ 'నేను శైలజ' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా కీర్తి సురేష్ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధించడంతో ప్రస్తుతం కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా కీర్తి సురేష్ కు నటిగా గొప్ప  ప్రశంశలను కూడా తెచ్చిపెట్టింది.  

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.  తెలుగు,  తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న కీర్తి సురేష్ కు గత కొంతకాలంగా వరుస పరాజయాలు  వెంటాడుతున్నాయి.  కీర్తి సురేష్ నటించిన రంగ్ దే , గుడ్ లక్ సఖి థియేటర్ లో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్,  మిస్ ఇండియా సినిమాలను 'ఓ టి టి' లో విడుదల అయ్యాయి.  ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.  ఇలా థియేటర్ లలో,  'ఓ టి టి' లో వరుస అపజయాలను ఎదుర్కొన్న కీర్తి సురేష్ తాజాగా ఈ రెండింటిలోను విజయాలను అందుకుంది.  

తాజాగా కీర్తి సురేష్ సాని కాయుధం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో చిన్ని పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా అమెజాన్ ప్రేమ్ ఓ టి టి లో విడుదల అయింది.  ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  అలాగే తాజాగా సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్,  మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇలా కీర్తి సురేష్ థియేటర్ మరియు 'ఓ టి టి' రెండిటి లోనూ విజయాలను అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: