టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ కెరియర్ లో మొదటి సారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కంటే ముందు అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను సినిమాలలో నటించాడు. కాకపోతే ఈ సినిమాలు అఖిల్ కు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందించలేకపోయింది.
ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ నిర్మాత అనిల్ సుంకర తో దర్శకుడు సురేందర్ రెడ్డి కి అభిప్రాయ బేధాల ఏర్పడ్డాయని దానితో దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీ నుంచి తప్పుకున్నారని, ఏజెంట్ మూవీ ఆగిపోయిందంటూ నెట్టింట ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టాడు. అఖిల్ హీరో గా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ మూవీ కొత్త షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లోనే మనాలీ లో ప్రారంభం కాబోతుంది అని , అలాగే త్వరలోనే ఏజెంట్ మూవీ టీజర్ అప్డేట్ ను కూడా ఇస్తామని, దయచేసి అఫీషియల్ పోస్ట్ లను మాత్రమే ఫాలో అవ్వండి అని , రూమర్ లని పట్టించుకోవద్దంటూ ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ విధంగా నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చింది.