బాలీవుడ్ సమంతని ఆ రకంగా అవమానించిందా..!!

Divya
సమంత గత సంవత్సరం నాగ చైతన్య తో విడాకులు ప్రకటించిన తర్వాత చాలా డిప్రెషన్కు గురైన ది. ఆ సమయంలో సమంత చేస్తున్న పనులు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగులో నటించి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ పాట సమంతనే బాలీవుడ్ లో మరింత పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో బాలీవుడ్ మొత్తం సమంత గురించి మాట్లాడుకునేలా చేసిందని చెప్పవచ్చు. ఇక అంతకుముందే ది ఫ్యామిలీ మాన్ -2 అనే వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుకుంది.
ఇక బాలీవుడ్ లో ఈ పాట తరువాత బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సమంత దగ్గరకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ సమంత మాత్రం ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కేవలం వెబ్ సిరీస్ లను మాత్రమే ఒప్పుకొని బాలీవుడ్లో ఆఫర్లు ను దక్కించుకుంది. అయితే సమంత ఇలా ఎందుకు చేస్తోందో మాత్రం అంతుచిక్కడం లేదు. తాజాగా గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసినది. కేవలం తర్వాత తన దృష్టి అంతా యశోద సినిమా పైనే పెట్టింది.
 సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగానే విజయ్ దేవరకొండ సినిమా నీ ఓకే చేసింది. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రానికి కుషి అనే టైటిల్ ని కూడా నిర్వహించారు చిత్రబృందం. అయితే ప్రస్తుతం సమంత ఎక్కువగా తెలుగు సినిమాల పైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇందుకు గల కారణం ఏమిటనే విషయం కూడా తాజాగా బయటపడింది. అదేమిటంటే పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ మేకర్స్ సమంతాకి భారీ స్థాయిలో ఆఫర్లు ఇచ్చారు. అయితే అవన్నీ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లేనట.. ఆ కారణంగానే సమంత బాలీవుడ్ ఆఫర్లు తిరస్కరించింది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: