రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ కు మహేష్ బాబు ట్రీట్మెంట్ !

Seetha Sailaja
రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించిన టాప్ హీరోకి ఆతరువాత వచ్చే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని ప్రచారంలో ఉన్న సెంటిమెంట్ కు ‘ఆచార్య’ ఘోర పరాజయం మరొకసారి బలాన్ని చేకూర్చింది. జక్కన్న సెంటిమెంట్ మార్చితీరుతాను అంటూ ఓపెన్ గా చెప్పిన చిరంజీవి కూడ మార్చలేకపోయాడు. దీనితో రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ కు నష్టపోయే టాప్ హీరోల జాబితాలో త్వరలో మహేష్ చేరబోతున్నాడు అన్నసంకేతాలు వస్తున్నాయి.

రాజమౌళి మహేష్ ల ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రారంభం అయి 2024 దసరాకు విడుదల అయ్యేలా భావిస్తున్నారు. అలా కుదరకపోతే 2025 సంక్రాంతికి ఈమూవీ విడుదల అవుతుంది అంటున్నారు. ఈలోపున మహేష్ త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ పూర్తిచేసుకుని రాజమౌళికి బంధీ అయిపోతాడు. అయితే మహేష్ ఈమధ్య అనీల్ రావిపూడికి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఈమధ్య మహేష్ ‘సర్కారు వారి పాట’ యూనిట్ సభ్యులకు తన ఇంటిలో డిన్నర్ ఇచ్చినట్లు టాక్. ఈడిన్నర్ కు మహేష్ సన్నిహితులు చాలామంది వచ్చినట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ లో అనీల్ రావిపూడి కూడ ఉండటంతో అతడు మహేష్ పార్టీకి వెళ్ళినట్లు సమాచారం. ఆపార్టీలో మహేష్ అనీల్ రావిపూడి దగ్గరకు వెళ్ళి తనకు ఒక మంచి కథ కావాలి అని అడిగినట్లు తెలుస్తోంది.

దీనితో మహేష్ అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో రాబోయే మూవీ రాజమౌళితో మహేష్ చేయబోతున్న మూవీ తరువాత ఉంటుందా లేదంటే రాజమౌళి మూవీ ప్రారంభం లేట్ అయితే ఈలోపున త్రివిక్రమ్ మూవీ తరువాత అనీల్ రావిపూడి మూవీని కూడ పూర్తి చేస్తాడా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మహేష్ తన మనసులోని మాటను ఎవరికీ చెప్పాడు అన్న ప్రచారం కూడ ఉంది. దీనితో రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ గురించి మహేష్ ముందు చూపుతో ఉన్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: