టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, 'గీత గోవిందం'ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట' . మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ సంస్థతో జీఎంబీ బ్యానర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగస్వామిగా వ్యవహరించి ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాని నిర్మించారు. విడుదల అయిన రోజు నుంచే భారీ వసూళ్లు నమోదు చేస్తూ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.బాక్సాపీస్ వద్ద పాత రికార్డులు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది.కేవలం ఐదే ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 116 కోట్ల షేర్ని సాధించి, రికార్డు క్రియేట్ చేసింది. ఐదు రోజుల్లో రూ.100కోట్ల పైగా షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రమిది. ఇక నైజాం ఏరియాల్లో ఈ చిత్రం మొత్తం 31.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాం ఏరియాలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రమిది. ఈ సినిమాకి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కేవలం 5 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఇదే స్పీడ్ కనుక కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే 'సర్కారు వారి పాట' సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదట ఈ సినిమాపై మహేష్ యాంటి ఫ్యాన్స్ చాలా దారుణంగా నెగటివ్ ప్రచారం చేశారు. అలాగే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కూడా ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ బూతులతో రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు.మొత్తానికి ఒక మంచి సినిమాని కాపాడటానికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారని మహేష్ ఫ్యాన్స్ నిరూపించారు. తమ అభిమాన హీరో జోలికి వస్తే అసలు ఊరుకునేది లేదని మహేష్ ఫ్యాన్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.