రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన బాహుబలి మూవీ తో ఫుల్ క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తర్వాత కూడా వరుస పెట్టి సాహో , రాధే శ్యామ్ వంటి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో నటించి ఆ రెండు సినిమా లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కాకపోతే సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను తెచ్చుకోగా, రాధే శ్యామ్ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. తాజా గా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేశాడు. తాజాగా ఓ అభిమాని పోస్ట్ కు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ... ప్రాజెక్ట్ కే మూవీ లో ప్రభాస్ ఇంట్రో తో ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. జూన్ నెల చివరి వరకు మళ్ళీ మూవీ షూటింగ్ మొదలు అవుతుంది. అందరం ప్రాణం పెట్టి ప్రాజెక్ట్ కే మూవీ కోసం పని చేస్తున్నాం, అంటూ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను తాజాగా తెలియ జేశాడు.