అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే ఇప్పటివవరకు ఎన్నో తెలుగు, తమిళ , హిందీ భాషల మూవీ లలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ మధ్య ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే రాధే శ్యామ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే , కీర్తి సురేష్ ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.
అది ఏ విషయంలో అని అనుకుంటున్నారా... ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటిస్తూనే, స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా నటిస్తూ వస్తుంది. ఇప్పటికే రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన్న సినిమాలో రజనీ కాంత్ కి చెల్లెలు పాత్రలో నటించి మెప్పించిన కీర్తి సురేష్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ పాత్రలలో నటిస్తూనే మరో వైపు స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ ను పూజా హెగ్డే కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ లో కబి ఈద్ కబి దివాళి పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్ కు చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ చెల్లాలి పాత్రలో నటించబోతోన్న పూజ హెగ్డే పాత్రకు కూడా ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉండబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.