కొరటాల శివ చేయలేని పని చేసిచూపెట్టిన పరుశురామ్ !
వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ కథ సామాజిక స్పృహతో ఉన్నప్పటికీ ఆ కథను స్పష్టంగా చెప్పలేక మహేష్ కోసం ఈకథలో పరుశురామ్ ఎన్నో మార్పులు చేసాడు అన్నవిమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలను పట్టించుకోకుండా ఈసినిమాను సగటు ప్రేక్షకుడు ఒక్కసారి చూసే సినిమాగా తీర్పు ఇవ్వడంతో ఈమూవీ కలక్షన్స్ మరీ నిరాశ పరచలేదు.
దీనికితోడు మొదటిరోజు ఈమూవీ పై వచ్చిన నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఈ మూవీ నిలబడటంతో బయ్యర్లు సేఫ్ అంటున్నారు. అయితే ‘ఆచార్య’ విషయంలో అలా జరగకకుండా ఆమూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ తో రోజురోజుకు ఆమూవీ కలక్షన్స్ విపరీతంగా పడిపోవడంతో ‘ఆచార్య’ బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘సర్కారు వారి పాట’ కలక్షన్స్ చాల బాగున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం ఒకవిధంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తూ ఉంటే ఏకంగా ఈ మూవీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ‘పుష్ప’ ‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ ను దాటేస్తుంది అంటూ జరుగుతున్న సరికొత్త ప్రచారం మరింత షాకింగ్ గా మారింది.
‘సర్కారు వారి పాట’ సక్సస్ మీట్ ను విజయవాడలో ప్రేక్షకుల మధ్య నిర్వహించబోతున్నారు. అయితే ‘ఆచార్య’ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిన వెంటనే కనీసం ఆసినిమాను నిలబెట్టే ప్రయత్నాలు చేయకుండా కొరటాల శివ షాక్ లో ఉండిపోయాడు. దీనితో కొరటాల కంటే పరుశురామ్ తెలివైన వాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..