SVP : 4 రోజుల్లో రాబట్టిన అసలైన వసూళ్లు ఇవే!

Purushottham Vinay
తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన అనేది దక్కుతోంది.దాని ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 4 రోజుల్లో రియల్ గా ఎంత వసూలు చేసిందో మీరే చూడండి.ఇక సర్కారు వారి పాట సినిమా  కేవలం 4 రోజుల్లో రూ. 109 కోట్లు షేర్ ని వసూలు చేసి తన సత్తా చాటింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా బాగా రాణించింది. ఇక గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 150 కోట్ల వైపు ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక USA లో 4 వ రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ల డాలర్లను చాలా అలవోకగా దాటేసింది.వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట' వసూళ్ల సునామికి ఇప్పట్లో అడ్డుకట్ట పడే టట్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు పండించడం ఖాయం.


ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో "పుష్ప", "రాధే శ్యాం" వంటి పలు పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ చేసి "ఆర్ఆర్ఆర్" తరువాత రెండవ స్థానంలో దూసుకుపోతుంది. అలాగే "ఆచార్య" లైఫ్ టైం వసూళ్లను కేవలం రెండ్రోజుల్లోనే బద్దలు కొట్టగా "భీమ్లా నాయక్" లైఫ్ టైం వసూళ్లను కూడా 4 రోజుల్లో దాటేసింది.మొత్తానికి ఈ సినిమా ప్రాంతీయ సినిమాల్లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది.సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టి రికార్డ్ హిట్ అయ్యింది.ఇక పరశురాం పెట్ల డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకి యస్ యస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో తమిళ విలక్షణ దర్శక నటుడు సముద్రఖని విలన్‌గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: