అప్పటి నుండి ప్రారంభం కాబోతున్న 'జనగణమన' షూటింగ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన  అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని 25 ఆగస్టు 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. లైగర్ సినిమా సెట్స్ పై ఉండగానే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,  విజయ్ దేవరకొండ హీరో గా జనగణమన అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు.

ఇది ఇలా ఉంటే జనగణమన సినిమా షూటింగ్ ను జూన్ చివరి వారం నుండి  ప్రారంభించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. జనగణమన మూవీ లో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే ను చిత్ర బృందం హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. జనగణమన మూవీ ని పూరి జగన్నాథ్ మొదట మహేష్ బాబు తో చిత్రీకరిం చాలి అని అనుకున్నట్లుగా అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే చివరగా జనగణమన మూవీ ని పూరి జగన్నాథ్,  విజయ్ దేవరకొండ తో తెరకెక్కించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో లైగర్  మూవీ లో హీరో గా నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ మూవీ తో పాటు శివ నిర్మాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఖుషి మూవీ లో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.  ఖుషి మూవీ ని తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ భాషల్లో 23 డిసెంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: