సమంత తండ్రిని కలిసిన నాగార్జున.. ఏమన్నారంటే?

Purushottham Vinay
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు ఆమె రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు నాగ చైతన్య కూడా  సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అలాగే వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరో స్టేటస్ ఇంకా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సాధించుకున్నాడు.ఇక ఇదిలా ఉండగానే ఇప్పుడు అక్కినేని నాగార్జున తీసుకున్న ఒక నిర్ణయం షాకింగ్ గా ఉందంటూ ప్రచారం సాగుతోంది.ఇటీవలే కింగ్ నాగార్జున నేరుగా వెళ్లి తన మాజీ కోడలు సమంత నాన్న గారిని కలిసారట. సమంత – చైతన్య భవిష్యత్ బావుండాలని దానికోసం ఏదైనా చేయాలని ఆయనతో ముచ్చటించారని సోషల్ మీడియాలో మీడియాలో అనధికారిక కథనాలొస్తున్నాయి. నిజానికి కోడలు సమంత అంటే నాగార్జునకు ఎంతో అభిమానం. సమంతకి నాగార్జున అన్నా అంతే అభిమానం.


అక్కినేని ఫ్యామిలీలో ఎంతో కలివిడిగా కలిసిపోయిన సమంత ఉన్నట్టుండి చైతన్యతో గొడవపడి విడిపోవడం అసలు ఎవరూ జీర్ణించుకోలేనిది. వీళ్ల విడాకుల టైంలో నాగార్జున కూడా ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారన్న కామెంట్స్ కూడా ఎక్కువుగా వినిపించాయి. అయితే ఇద్దరి ఫ్యూచర్ బాగుండాలని నాగార్జున వారిని కలిపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇక ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.ఇదిలా ఉంటే కేవలం ఒక్కరోజు వ్యవధిలో సమంత, నాగ చైతన్య నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. నాగ చైతన్య నటిస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చైతు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీ ఇంకా తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: