పూజా హెగ్దే బ్లాస్టింగ్ రెమ్యునరేషన్..!

shami
బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటుంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే పూజా హెగ్దే ఉంది అంటే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అన్నట్టే లెక్క. అయితే రీసెంట్ గా అమ్మడు నటించిన రాధే శ్యాం, బీస్ట్, ఆచార్య 3 సినిమాలు ఫలితాలు నిరాశపరచాయి. ఈ క్రమంలో ఆమె క్రేజ్ తగ్గుతుందేమో అనుకుంటే ఫలితాలతో సంబంధం లేకుండా అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చేస్తున్నాయి. లేటెస్ట్ గా పూజా హెగ్దే మరో రెండు సూపర్ ఛాన్సులు పట్టేసిందని తెలుస్తుంది. అందులో ఒకటి త్రివిక్రం, మహేష్ సినిమా కాగా.. మరొకటి పూరీ, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న జన గణ మన అని తెలుస్తుంది.
పూరీతో ఆల్రెడీ లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ వెంటనే మరో ప్రాజెక్ట్ సైన్ చేశాడు. మహేష్ తో చేద్దామనుకున్న జన గణ మన సినిమాని పూరీ విజయ్ తో చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారు. సినిమాలో నటించేందుకు గాను అమ్మడు బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. సినిమా కోసం పూజా హెగ్దే వి 45 రోజుల డేట్స్ అడిగారట. అందుకోసం అమ్మడు 4.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న జన గణ మన సినిమా లో నటించేందుకు పూజా హెగ్దే కూడా అదే రేంజ్ రెమ్యునరేషన్ కోరుతుందని తెలుస్తుంది. పూజా హెగ్దే కావాలంటే మాత్రం ఆమె కోరిక రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. చేస్తున్న సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా పూజా హెగ్దే డిమాండ్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతుందని చెప్పొచ్చు. నాలుగున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే మాత్రం సౌత్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా పూజా హెగ్దే రికార్డ్ కొట్టినట్టే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: