వార్నీ : త్రివిక్రమ్ సినిమా గురించి మహేష్ అలా అన్నారేంటి .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మహేష్ బాబు, లేటెస్ట్ గా సర్కారు వారి పాట తో మరొక సక్సెస్ ని అందుకుని మంచి జోష్ మీదున్నారు. ఆయనకీ జోడిగా కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థల వారు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు.
మహేష్ బాబు వడ్డీ వ్యాపారస్థుడిగా కనిపిన్సిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మది కెమెరా మ్యాన్ గా పని చేసారు. అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, మరొక రెండు రోజుల్లో విజయవాడలో జరుగనున్న ఈ మూవీ విజయోత్సవ వేడుకలో పాల్గొననున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ, తన తదుపరి సినిమాలు ఇకపై ఫ్యాన్స్, ఆడియన్స్ ని మరింతగా అలరిస్తాయని, ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాతో పాటు తదుపరి రాజమౌళి సినిమాల విషయమై ప్రస్తుతం తాను కూడా సన్నద్ధం అవుతున్నట్లు చెప్పారు.
హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్న తన తదుపరి సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని, ఆ సినిమా ఎంతో భారీ ఎత్తున రూపొందనుండగా, దీనిని కేవలం రీజినల్ ఫిలింగానే తీయనున్నాం అని, అయితే రాజమౌళి తో చేయనున్న సినిమా మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా రూపొందనుందని మహేష్ చెప్పారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని కొన్నాళ్ల నుండి భావిస్తూ వస్తున్నారు, అయితే ఇది కేవలం రీజినల్ మూవీగానే తెరకెక్కుతోందని మహేష్ చెప్పడంతో వారు ఒకింత డిజప్పాయింట్ అయినప్పటికీ తప్పకుండా మాత్రం మూడవసారి గురూజీ తో సూపర్ స్టార్ పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాం ఖాయం అని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: