పుష్ప 2 : పెరిగిన బడ్జెట్.. రూల్ చేయడం ఖాయం!

Purushottham Vinay
ఇక అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప సినిమా. సడెన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. నిజానికి ఈ సినిమా సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ కే చాలా ఎక్కువ నచ్చేసింది.అందుకే పుష్ప 2 సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి.ఇక బాహుబలి 2, కేజీఎఫ్2 లాంటి సీక్వెల్స్ కి దక్కిన ఆదరణ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అందుకే పుష్ప సినిమా సీక్వెల్ లో కూడా అంతకు మించి అనిపించే మార్పులు చేస్తున్నారు. ఆ విషయంలో తగ్గేదే లే అంటున్నాడు పుష్పరాజ్ అల్లు అర్జున్.పుష్ప సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేసింది లేదు… పెద్దగా అంచనాలు కూడా లేవు. పెద్దగా వసూళ్లు కూడా రాలేదు.అయినా కానీ పుష్పరాజ్ ను నార్త్ ఇండియా ఆడియెన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు. ఎలాగూ సౌత్ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ తో పుష్ప ది రైజ్ ఇక్కడా సక్సెస్ కొట్టింది.కాబట్టి సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో బాగా పెరిగింది. అందుకే ఆ అంచనాలను మించేలా పుష్ప2 సినిమాని తీసుకురాబోతున్నారు మేకర్స్.


నిజం చెప్పాలంటే ఇప్పుడే అసలైన ఎగ్జైట్ మెంట్ దొరికింది కాబట్టి సీక్వెల్ ను అనుకున్నదాని కంటే చాలా గ్రాండ్ గా సుక్కూ – బన్నీ ప్లాన్ చేస్తున్నారు.ఇక బన్నీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా పుష్ప ది రూల్ తెరకెక్కనుంది. దాదాపు 400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కు 100 కోట్లు, సుకుమార్ కు 60 కోట్లు ఇంకా అలాగే మిగిలిన ఆర్టిస్టులకు 40 కోట్లు పోయినా.. మరో 200 కోట్లు అయితే కేవలం ప్రొడక్షన్ కోసమే మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు చేయనుంది. ఉన్నట్టుండి ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు పెరగడంతో పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నారు. అలాగే కొత్త కొత్త క్యారెక్టర్లను కూడా పుష్ప పార్ట్ 2లో ప్రవేశ పెట్టబోతున్నారు సుకుమార్. ముఖ్యంగా కేజీఎఫ్2 సినిమా సృష్టించిన సంచలనం సుకుమార్ – బన్నీపై పెద్ద ఎఫెక్ట్ చూపించింది.అందుకే ఆ రేంజిలో హిట్ కొట్టడానికి పెద్ద ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: