ఐ కాన్ ఫార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో ఎ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. పుష్ప సినిమా విషయంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన కొన్ని పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించిన 'ఊ అంటావా మావా' ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ విడుదలైన అప్పటి నుండి యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇలా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన ఈ సాంగ్ గురించి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్వీర్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
అసలు విషయంలోకి వెళితే... రణ్వీర్ సింగ్ తాజాగా జయేశ్భాయ్ జోర్దార్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండేతో పాటు అనన్య నాగల్ల కీలక కూడా పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్వీర్ సింగ్ కి తెలుగు లో మీకు నచ్చిన పాట ఏది ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి రణ్వీర్ సింగ్ , అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' లోని 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ఇష్టమని తెలిపాడు.