ఆ లేడీ డైరెక్టర్ పిలుపుకు షాక్ అయిన మహేష్ !

Seetha Sailaja

విజయనిర్మల జీవిత రాజశేఖర్ ల తరువాత మహిళా దర్శకులలో పేరుగాంచిన వ్యక్తి నందినీ రెడ్డి. ఈమె దర్శకత్వం వహించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమధ్య తీసిన ‘ఓబేబి’ మూవీకి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆమెకు చెప్పుకోతగ్గ అవకాశాలు రావడంలేదు.

ఆమె కెరియర్ ప్రారంభంలో సహాయ దర్శకురాలుగా కృష్ణవంశీ దగ్గర పనిచేసింది. మహేష్ కృష్ణవంశీ ల కాంబినేషన్ లో నిర్మింపబడ్డ ‘మురారీ’ మూవీకి కూడ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. అప్పట్లో ఆమూవీ షూటింగ్ జరుగుతున్న రోజులలో ఒక సందర్భంలో షాట్ రెడీ అన్న విషయాన్ని మహేష్ కు చెప్పమని కృష్ణవంశీ చెప్పాడట.


దూరంలో ఉన్న మహేష్ వైపు చూస్తూ ‘మహేష్ షాట్ రెడీ’ అని పిలిచిందట. ఆ పిలుపుకు షాక్ అయిన చాలామంది మహేష్ ను అలా పిలిచావు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆమె నవ్వుతూ ‘బాబు మహేష్ బాబు’ అని పిలవాలా అని అడిగిందట. అయితే అలా పిలిచినందుకు నందినీ రెడ్డి పై ఎలాంటి కోపం మహేష్ కు రాలేదని నందినీ రెడ్డి చెప్పింది. అంతేకాదు టాప్ యంగ్ హీరోలు అల్లు అర్జున్ జూనియర్ లను కూడ అలాగే పేరుపెట్టి పిలుస్తానని ఆమె చెపుతోంది. తారక్ తనను అక్కా అని పిలుస్తాడు అని కూడా చెపుతోంది.

అయితే ఇంతమంది టాప్ హీరోలను పేరుపెట్టి పిలిచే నందినీ రెడ్డి ప్రభాస్ విషయానికి వచ్చేసరికి మాత్రం అతడిని ‘ప్రభాస్’ గారు అని పిలుస్తుందట. అంతేకాదు తనకు ప్రభాష్ పై చాల క్రష్ ఉంది అనిచేపుతోంది. ప్రభాస్ కృష్ణవంశీ లు కలిసి ‘చక్రం’ మూవీలో చేస్తున్నప్పుడు తనను కృష్ణవంశీ ప్రభాస్ కు పరిచయం చేసినప్పుడు తాను తెగసిగ్గు పడిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే తను సిగ్గుపడటం చూసి ఆశ్చర్యపడిన కృష్ణవంశీ ‘నీ మొఖానికి సిగ్గు సూటు కాదు’ అంటూ అప్పట్లో జోక్ చేసాడట..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: