వామ్మో : ఇదెక్కడి మాస్ అండి ... మహేష్ బాబు గారు ... ??
సముద్రఖని విలన్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, నదియా, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు చేయగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేసారు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకాభిమానులు ముందుకు రానున్న సర్కారు వారి పాట మూవీ తప్పకుండా మంచి విజయం అందుకుంటుందని హీరో మహేష్ తో పాటు యావత్ యూనిట్ మొత్తం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ చాలా ప్రాంతాల్లో నేడు ఉదయం నుండి ఆన్ లైన్ లో ఓపెన్ అయ్యాయి.
ముఖ్యంగా హైదరాబాద్, నైజాం సహా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో సర్కారు వారి పాట టికెట్స్ ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉండడంతో మహేష్ బాబు బాక్సాఫీస్ ప్రభంజనానికి అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అటు యుకె, కెనడా, యుఎస్ఏ లో కూడా ఈ మూవీ టికెట్స్ బాగా సేల్ అవుతున్నాయని, చూడబోతే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ అయిన ఫస్ట్ డే పెద్ద రికార్డ్స్ కొట్టడం ఖాయం గా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి రిలీజ్ తరువాత సర్కారు వారి పాట ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.