ప్రాజెక్టు k లో మరో బాలివుడ్ హీరోయిన్ ఎంట్రీ..

Satvika
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజిగా వున్నాడు. సినిమా హిట్ అయిన, ఫట్ అయిన కూడా సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్టు K’.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.. మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తీ చెయనున్నారు. 


ఈ సినిమాకు 500 కోట్లు వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.గతంలో ప్రభాస్ నటించిన ఎ సినిమా కు ఇంత బడ్జెట్ లేకపోవడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ‘ప్రాజెక్టు K’. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు..


కాగా, ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది. తెలుగు లో లోఫర్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దిశా పటాని ‘ప్రాజెక్టు K’లో నటించనుంది. దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ని పంపించారు చిత్ర యూనిట్. దానిపై దిశా పటానికి ‘ప్రాజెక్టు K’లోకి వెల్కమ్ అని రాసి ఉంది. దిశా ఈ స్పెషల్ గిఫ్ట్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.. త్వరలోనే దిశా సెట్స్‌కి రానుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. కనీసం ఈ సినిమా అన్నా డార్లింగ్ కు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: