టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి పలు విజయవంతమైన మూవీ లతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ తో పాటు విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో ఇది వరకు మహానటి సినిమా వచ్చింది. మహానటి సినిమా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైజర్ మూవీ తర్వాత మరో సారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.