"సూర్య - బాల" ప్రాజెక్ట్ నుండి అప్డేట్... !

VAMSI
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న విషయం విదితమే. సూర్య నుండి సినిమా వస్తోంది అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా తాజాగా ఈ హీరో నూతన చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాలాతో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. చాలా కాలం తరవాత వీరికి కాంబో ముహూర్తం కుదరటంతో కథ ఏంటి ? హీరోయిన్, నటీనటులు ఎవరు..? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ? అని అంశాలు ప్రత్యేకతను సంతరించుకున్న క్రమంలో ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.
 
రీసెంట్ గా కన్యాకుమారిలో ఈ మూవీ షూటింగ్ షురూ కాగా... ఈ సినిమాలో సూర్య పాత్ర మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండనుంది అని గెటప్ కూడా కొత్తగా ఉండబోతుందని సమాచారం. అంతేకాదు ఈ చిత్ర కథ సముద్ర నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ మొత్తం సముద్రం నేపథ్యంలోనే ఉండబోతుందని కోలీవుడ్ మీడియా అంటోంది.  సూర్య పాత్రను ఎంతో ప్రత్యేకంగా చిత్రీకరించనున్నారు దర్శకుడు బాబీ అని అంటున్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉండగా అందులో ఒకరు కృతి శెట్టి అని ఇప్పటికే ప్రకటించగా  మరొక హీరోయిన్ గా న్యాచురల్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
 
కాగ ఇక్కడ వినిపిస్తున్న మరో విశేషం ఏమిటంటే సముద్ర నేపథ్యంలో చిత్రం కావడంతో... అటువంటి కథకు అచ్చొచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నే మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని... సెంటిమెంటల్ గా ఇది వర్కౌట్ అవుతుందని ఒక అలోచనట. ఇక అందం లోనూ, నటనలోనూ ముందే ఉన్నారు కృతి శెట్టి. ఇటీవల సూర్య నుండి వచ్చిన ఈటి చిత్రం ఆశించిన అంచనాలను అందుకు ఒక పోవడంతో ఈ సారి బాలా కాంబోతో భారీ సక్సెస్ ను  అందుకోవాలని చాలా కసిగా ఉన్నారట హీరో సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: