టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో బండ్ల గణేష్ నిర్మాతగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. బండ్ల గణేష్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ ,ఇద్దరమ్మాయిలతో బాద్ షా , గోవిందుడు అందరివాడేలే వంటి పలు సినిమాలను నిర్మించాడు. తాజాగా బండ్ల గణేష్ డేగల బాబ్జి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.
ఇది ఇలా ఉంటే నటుడు మరియు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు అయిన రోజా కు మధ్య విభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. గతంలో వీరిద్దరూ ఒకరి నొకరు దూషించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజా గురించి బండ్ల గణేశ్ చాలా అభిమానంగా మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీనటి మరియు రాజకీయ నాయకురాలు అయిన రోజాకు సినిమా ఇండస్ట్రీ తరఫున సన్మానం చేయాలి అని తాజాగా బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు.
ఎమ్మెల్యే గా రెండు సార్లు గెలిచిన రాజా కు మంత్రి పదవి దక్కడం చాలా సంతోషకరమైన విషయం అని బండ్ల గణేష్ తెలియజేశారు. రోజా ని మంత్రిగా చూడడం చాలా ఆనందంగా ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ తెలియజేశాడు. రోజా కు మంత్రి పదవి ఇచ్చినా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ అన్నారు. ఇలా తాజా ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ , రోజా పై ప్రశంసల వర్షం కురిపించాడు.