నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అదే... అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ సార్ దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  దర్శకుడు అనిల్ రావిపూడి , కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో  దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడిగా అనిల్ రావిపూడి కి మంచి గుర్తింపు కూడా లభించింది.  ఆ తర్వాత అనిల్ రావిపూడి సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు మూవీ లను తెరకెక్కించాడు.  ఈ నాలుగు మూవీ లు  కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి.  

ఇలా ఇప్పటి వరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు కాకపోవడంతో దర్శకుడు అనిల్ రావిపూడి  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.  అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తూండగా , ఈ మూవీ లో తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  

ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలియజేశాడు... అనిల్ రావిపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలియజేస్తూ... ఎఫ్ 3 సినిమా తర్వాత నేను బాలకృష్ణ తో తెరకెక్కించబోయే  సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనిల్ రావిపూడి తెలియజేశాడు.  బాలకృష్ణ తో నేను తెరకెక్కించబోయే సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది అని ,  అలాగే ఈ మూవీ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండబోతోంది  అంటూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అనిల్ రావిపూడి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: