నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ తన సినీ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదలైన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాతో అదిరిపోయే కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర సాధించాడు.
ఇదిలా ఉంటే అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ కనిపించబోతున్నాడు. అలాగే మరొక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో కనిపించబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో బాలకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా స్టార్ట్ కాబోతుంది. తాజాగా బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు యంగ్ సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.