హీరో సిద్ధార్థ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాతో అటు తమిళ ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా అవకాశాలు దక్కించుకున్న సిద్ధార్థ్ అందులో భాగంగా నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం విజయాలను బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ క్రేజీ హీరోగా మారిపోయాడు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకోలేక పోయాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన మహా సముద్రం మూవీ తో తెలుగు ప్రేక్షకులను సిద్ధార్థ్ పలకరించాడు. కాకపోతే ఈ సినిమా కూడా ఈ హీరో కు నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ పాన్ ఇండియా సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా అన్నది అగౌరవకరమైనది, అదో నాన్సెన్స్ అంటూ సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం చేసేవి అన్నీ కూడా భారతీయ సినిమాలే అయినప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు అంటూ సిద్ధార్థ్ తాజాగా పాన్ ఇండియా సినిమాలపై స్పందించాడు. అలాగే 15 సంవత్సరాల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని చాలా మంది చూశారు. ఎవరికి నచ్చిన భాషలో సినిమాలు తీసే హక్కు వారికి ఉంది. కాబట్టి పాన్ ఇండియా అనే పదం తీసేయాలి లేకపోతే ఏ భాషలో లో సినిమాను తెరకెక్కిస్తే ఆ మూవీ ని ఆ భాషలో పిలవాలి అంటూ పాన్ ఇండియా సినిమాలపై సిద్ధార్థ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.